మన్యం న్యూస్, మణుగూరు/అశ్వాపురం, ఫిబ్రవరి09 : నేను సైతం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల జువాలజీ అధ్యాపకులు తార ప్రసాద్ సేవలు ఎంతో అభినందనీయమని అశ్వాపురం ఎస్సై నాగుల్ మీరా అన్నారు. ఆయన గురువారం నేను సైతం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్య కార్యక్రమం 40 వ రోజు సందర్బంగా ప్రారంభించి మాట్లాడారు. ఎంతో చక్కటి కార్యక్రమమని, పేద విద్యార్థులకు ఉపయోగకరమైందన్నారు. ప్రతి ఒక్కరు తారా ప్రసాద్ ను ఆదర్శనంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు కూడా అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చక్కగా చదివి కళాశాలకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
