UPDATES  

 గురుకుల విద్యాలయంలో దరఖాస్తులకు ఆహ్వానం

 

మన్యం న్యూస్, భద్రాచలం , ఫిబ్రవరి 09..

2023 -24 విద్యా సంవత్సరానికి తరగతుల వారీగా ఉన్న ఖాళీల లను  భర్తీ చేయుటకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ప్రవేశం కొరకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లాలోని స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల (బాలురు)లకు ఖమ్మం నందు ఎనిమిదో తరగతిలో మాత్రమే రెగ్యులర్ ప్రవేశం కొరకు దరఖాస్తుల కోరుచున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్హత గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే  దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వెబ్సైట్ www.tswreis.ac.in
లేదా tgtwgurukulam.telangana. gov. in ద్వారా ఈ నెల 9 నుంచి మార్చి 7, వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ ప్రవేశాల కొరకు తెలంగాణ రాష్ట్రంలో సూచించబడిన కేంద్రాలలో 16 ఏప్రిల్ 2023 ఆదివారం నాడు ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడునని, ఈ యొక్క పాఠశాలల్లో ఖాళీల వివరములు, దానికి సంబంధించిన సమాచారం పైన చూపబడిన వెబ్సైట్లో చూసుకొని సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఆయన అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !