మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 09…
షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతై ఇల్లు కోల్పోయిన కుటుంబాన్ని గురువారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొరస వెంకటేశ్వర్లు అండగా నిలిచారు. మండలంలోని పర్ణశాల పంచాయతీ సీతానగరం గ్రామంలో శ్యామల వెంకటి ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం గా 5000 రూపాయలు నగదును కుటుంబ సభ్యులకు స్థానిక సర్పంచ్ తెల్లం వరలక్ష్మితో కలిసి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వం కోల్పోయిన వెంకటి కుటుంబానికి అందరూ సహాయం చేయాలని వీరికి ప్రభుత్వం నుండి రావలసిన సహాయాన్ని అధికారులు దృష్టికి తీసుకుని వెళ్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ వెంకటరమణ,ఆదివాసీ నాయకులు కామరాజు, మల్లుదొర, మురళి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.