UPDATES  

 101 బిందెలతో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి గంగా స్థానాలు ..       భక్తిశ్రద్ధలతో పాల్గొన్న వందలాది మంది మహిళలు ..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం, ఫిబ్రవరి 10..
శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 22వ జాతర మహోత్సవాల ఐదవ రోజు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 101 బిందెల తో గంగా స్థానాలు కార్యక్రమo లో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. పవిత్ర గోదావరి నది నుండి 101 బిందెలతో గంగా నీరు తీసుకువచ్చిన మహిళలు ముత్తైదువలు అమ్మవారి జన్మస్థానమైన ఆలయ ఆవరణలో వేపచెట్టు రాగి చెట్టు కలిగిన చోట 101 బిందెలతో గంగా స్థానం చేయించారు. అత్యంత నిష్టగా భావించే ఈ గంగా స్థానం కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఇతర అనేక ప్రాంతాలకు చెందిన మహిళలు ముత్తైదువులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని గంగా స్థానాల అనంతరం అమ్మవారి జన్మస్థలం వద్ద పూజలు నిర్వహించారు. అలంకరణ పూజలలో భాగంగా భద్రాచలం పట్టణానికి చెందిన శ్రీ నాగ తులసమ్మ వారి కుటుంబ సభ్యులు మధ్యాహ్నం అలంకరణలో చర్ల మండలం గోoపల్లి గ్రామానికి చెందిన గోల పత్తి మురళీకృష్ణ లలితా భవాని దంపతులు వారి కుటుంబ సభ్యులు సాయంత్రం అలంకరణలో భద్రాచలం పట్టణానికి చెందిన గొల్ల భూపతిరావు మంజుల రాణి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు గాజులు కుంకుమ పసుపు సమర్పించి అలంకరణ చేసి అభిషేకాలు నిర్వహించి పూజలు చేశారు. శుక్రవారం జాతరలో అమ్మవారిని మహిళలు భక్తులు అధిక శాతం దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు ఇచ్చిన విరాళాలతో ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించారు జాతర ఆరవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సతీష్ సినీ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా స్థానిక మండల ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలక్కుండా ఆలయ చైర్మన్ చుక్క గణేష్ రెడ్డి, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !