మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 10. మండల పరిదిలోని చిరుమల్ల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ కారం. మధు ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు.ఆశ్రమ పాఠశాలలోని వంటశాల, పిల్లలు పండుకునే గదులు, మినరల్ వాటర్ ప్లాంట్ పరిశీలించారు.అనంతరం విద్యార్థులకు జ్వరం ఉన్నవారికి రక్త నమూనాలను సేకరించి పరీక్షించారు పిల్లలందరికీ మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మధు మాట్లాడుతూ. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిల్వ లేకుండా చూడాలని ప్రధానోపాధ్యాయులు జగన్ కు సూచించారు.పిల్లలకు దోమలు కుట్టకుండా దోమతెరలు విధిగా వాడాలని, దోమల మందు వాడాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మలేరియా వైద్యాధికారి లింగ్య నాయక్ ,ఎస్ఐ జివన్ రాజు, ప్రధానోపాధ్యాయులు జగన్, వైద్య సిబ్బంది భద్రమ్మ, కృష్ణ, నరసింహారావు,తదితరులు పాల్గొన్నారు.
