UPDATES  

 ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆరో రోజు జాతర.. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని భక్తులు..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 11
శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి గ్రామ దేవత 22వ జాతర మహోత్సవముల లలో ఆరవ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం రెండవ గరగల ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. పురుషులు మహిళల వేషధారణలో గరగలను తలకెత్తుకుని దుమ్మగూడెం గ్రామంలో ఇంటింటికి తిరిగి పూజలు అందుకున్నారు ఆరో రోజు అలంకరణలో భాగంగా ఉదయం అలంకరణ హైదరాబాద్ నగరానికి చెందిన బండి సూర్యచంద్రరావు సంయుక్త దంపతులు వారి కుటుంబ సభ్యులు మధ్యాహ్నం అలంకరణలో దుమ్ముగూడెం గ్రామానికి చెందిన తాటిపూడి రామస్వామి అనసూర్య దంపతులు వారి కుటుంబ సభ్యులు సాయంత్రం అలంకరణలో భాగంగా దుమ్ముగూడెం మండలం బుర్ర వేముల గ్రామానికి చెందిన వారా శ్రీనివాసరెడ్డి వెంకటలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అలంకరణ చేసి అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆరో రోజు జాతరకు విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శనివారం రాత్రి ప్రేమ్ కుమార్ ఆర్ట్స్ టీవీ సినీ ఆర్టిస్ట్ వారి చేత సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించగా వేలాదిమంది ఈ కార్యక్రమం తిలకించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దుమ్ముగూడెం ఎస్ఐలు రవికుమార్ కేశవులు గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గణేష్ రెడ్డి ముత్యాలమ్మ తల్లి జాతర కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !