UPDATES  

 యువత దృఢమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి…. – బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్.

మన్యంన్యూస్,మణుగూరు, ఫిబ్రవరి11: యువత దృఢమైన లక్ష్యాలను ఏర్పరచుకొని సంకల్పంతో వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్ అన్నారు. ఆయన శనివారం మణుగూరు ఏరియా స్టోర్స్ గ్రౌండ్ లో టీడిఏ మాస్టర్ క్రికెట్ కప్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఆఖరి మ్యాచ్ కు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రుల రుణం తీర్చుకునే దిశగా ముందుకు సాగుతూ చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే విధంగా జీవన శైలిని మార్చుకోవాలన్నారు. అనంతరం మ్యాచ్ లో
గెలిచిన రనర్స్ కు పదివేల రూపాయలు తమ సొంత డబ్బును ద్వితీయ బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరి గౌడ్, యూసఫ్ షరీఫ్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ లెంట్ విద్యాసంస్థల చైర్మన్ యూసఫ్ షరీఫ్, నవీన్ బాబు, కడలి శ్రీను, ఉమా, పొడుపుగంటి సాంబ, నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !