పినపాక రాజకీయం హాట్ హాట్ గా మారింది. ఓ వైపు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పినపాక నియోజకవర్గంలో సోమవారం పర్యటిస్తున్నారు. అంబేద్కర్ సెంటర్ లో మీటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ విప్ గా ఎదిగిన ఆదివాసీ గిరిజన నేతను టార్గెట్ గా చేసుకుని పినపాక నియోజకవర్గంలో ఇతర నేతలు చేస్తున్న రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి.
..