- కన్నుల పండగ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర ముగింపు ..
- బందోబస్తు నడుమ గరిగల ఆఖరి ఊరేగింపు.
- వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకున్న భక్తులు..
- విశేషంగా ఆకట్టుకున్న విచిత్ర వేషధారణలు, గిరిజన కొమ్ముడోలు నృత్యాలు.
- భక్తులను అలరించిన బాణసంచా వెలుగులు…
మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 14
దుమ్ముగూడెం గ్రామంలో వెలిసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ( గ్రామ దేవత) 22వ జాతర మహోత్సవములు చివరి రోజైన మంగళవారం వైభవ ఘనంగా ముగిశాయి జాతర చివరి రోజు కావడంతో వేలాది మది భక్తులు హాజరు కావడంతో దుమ్ముగూడెం గ్రామం ఏ వీధి ఏ సందు చూసిన భక్తులతో కీటకటలాడింది. ఉదయం అలంకరణ వెంకటాపురం గ్రామానికి చెందిన బాచినేని రాజేశ్వరి వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి సమర్పించిన పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి అభిషేకములు పుష్పాలంకరణ పూజలతో ప్రారంభం కాగా గ్రామ పొలిమేరలో (లాకుల వద్ద ) ఉన్న ముత్యాలమ్మ చెట్టు వద్ద వేలాదిమంది భక్తులు అమ్మ దీవించమ్మా మా కోరికలు నెరవేర్చమ్మా అంటూ మొక్కలు చెల్లించుకున్నారు ముత్యాలమ్మ ఆలయం వద్దగల అమ్మవారి జన్మస్థానం చెట్టు వద్ద అమ్మవారికి కోరికలు తెలుపుతూ నెరవేరాలని వేడుకుంటూ వందలాదిమంది భక్తులు ముడుపులు కట్టారు జాతరలో ముగింపు రోజు ప్రధాన ఘట్టమైన గరగల ఊరేగింపు కార్యక్రమం అమ్మవారి గుడి ముందు గల ధ్వజ స్తంభానికి గల గంటలు మోగినానంతరం గరగలు గ్రామవీధుల్లో ఊరేగింపు ఉండగా గంటల మోగడం కొంత ఆలస్యం అవ్వడంతో గరగల ఊరేగింపు కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. పోలీస్ బందోబస్తు రోపు పార్టీతో నేల తాళాలతో డప్పు వాయిద్యాలతో పూనకాలతో జాతరలు ఆఖరి గరగల ఊరేగింపు అత్యంత నిష్టగా జరిగింది. మరోపక్క ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన గిరిజన కుమ్ముడోలు నృత్యాలు విచిత్ర వేషధారణలు కాళీమాత వేషధారణ కింగ్ కాంగ్ వేషధారణ రాక్షస వేషధారణ కోలాటం భక్తులను విశేషంగా ఆకర్షించగా డప్పు వాద్యాలు ప్రత్యేక బాణాసంచే కాల్చడంతో వివిధ ఆకృతులలో బాణా సంచాలు మిరిమిట్ల గొలిపాయి . హాజరైన భక్తులకు ఆలయ కమిటీ ఉచిత భోజన సౌకర్యాలు కల్పించగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దుమ్ముగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఇదిలా ఉండగా దుమ్ముగూడెం జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన అనేక బ్యాచుల పూర్వ విద్యార్థులు ఈ జాతర సందర్భంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఒకరినొకరు పలకరించుకొని తమ గత స్మృతులను పంచుకున్నారు. ఆ ముత్యాలమ్మ దయవల్ల ప్రతి రెండు సంవత్సరాలలో ఈ జాతర రూపంలో ఇలా కలుసుకోగలుగుతున్నామని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.దుమ్మగూడెం గ్రామంలో జరుగుతున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 22వ జాతర మహోత్సవములు భాగంగా భద్రాచలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కుంజా సత్యావతి, పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఆర్డీవో రత్న కళ్యాణి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారికి సాదరంగా స్వాగతం పలకగా అమ్మవారిని దర్శించుకున్న వారు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు ఈ ప్రాంత అమ్మవారు అన్నివేళలా చల్లగా చూడాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. 22వ ముత్యాలమ్మ తల్లి జాతర విజయవంతంగా ముగించడంతో కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
