మన్యం న్యూస్.ములకలపల్లి. ఫిభ్రవరీ14. మండలానికి చెందిన సీతయిగూడెం సర్పంచ్ కారం సుధీర్, చౌటుగూడెం సర్పంచ్ శ్రీను, రామచంద్రపురంసర్పంచ్ సున్నం సుధాకర్,లు మండలానికి అధికంగా నిధులు కేటాయిస్తూ అన్ని విధాలుగా ములకలపల్లి మండలానికి అండగా ఉంటూ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ను వారి నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ములకలపల్లి మండలానికి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఇచ్చినన్ని సీసీ రోడ్లు ఇదివరకు ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదని, మంగపేట హాస్పిటల్ అభివృధ్ది కి నిధులు కేటాయించడం, మండలాల్లో కొత్తగా ఏర్పడిన పంచాయతీలకు పంచాయతీ కార్యాలయాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించడం,అలాగే మారుమూల ప్రాంతమైన పాతగుండాలపాడు లాంటి గ్రామంలో పర్యటించి అక్కడ సమస్యలు తెలుసుకొని వెంటనే గ్రామంలో సీసీ రోడ్డు మంజూరు చేయడంతో పాటు,పోయించడం బీటి రోడ్డు మంజూరు చేయడం ఇలా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారని,మరోసారి అశ్వారావుపేట ఎమ్మెల్యే గా మెచ్చా నాగేశ్వరరావు గెలుస్తారని, మళ్ళీ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని స్పష్టం చేశారు.
