UPDATES  

 మండలంలో బిఆర్ఎస్ నాయకులు జారే ఆదినారాయణ విస్తృత పర్యటన

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 14:.. అశ్వరావుపేట మండలంలో బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. వినాయక పురం కాలనీ, వినాయక పూరం ఇందిరమ్మ కాలనీ, దబ్బతోగు, ఖమ్మం పాడు, బచ్చు వారి గూడెం, ఆసువారిగూడెం, కొత్తూరు, గమ్మడివల్లి మొదలైన గ్రామాలలో హలో శుభోదయం కార్యక్రమంలో భాగంగా, గ్రామస్తులతో కలిసి ప్రతి వీధి, ఇంటింటికి తిరుగుతూ అందరిని పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గమ్మడివల్లి గ్రామంలో చల్లా వారి వివాహం, వీరంకి వారి నిశ్చితార్థం, నూతన వధూవరులను ఆశీర్వదించారు. పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు, వాలీ బాల్ కిట్స్ పంపిణీ చేసారు. ఆటలోను మంచి ప్రదర్శన కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఏ అవసరం వచ్చినా జారేను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు అందుబాటులో ఉంటామని క్రీడాకారులకు మరియు గ్రామస్తులకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో, జక్కుల జగదీష్, పర్వతనేని ప్రమోద్, అల్లాడి రామారావు, చెన్నారెడ్డి, కుంజా రాముడు, రామినేని రాంప్రసాద్, కొర్రి రాజు, పుట్టా సత్యం, అమీర్, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !