మన్యం న్యూస్ చండ్రుగొండ,ఫిబ్రవరి14:
ప్రతి రోజు సైక్లింగ్ చేయటం వల్ల అనారోగ్య సమస్యలు తీరి, ఆరోగ్యవంతమైన జీవితం సాధ్యమవుతుందని మెడికల్ ఆఫీసర్ కనకం
తనూజ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సైక్లోతాన్(సైక్లింగ్)ను ఆమె లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ప్రతి మనిషి సైకిల్ తొక్కడం వల్ల చాలా వరకు కోలస్ట్రాల్ సమస్యలు తీరుతాయన్నారు. ఆరోగ్యపరంగా సమస్యలు రాకుండా కాపాడుకోగలుగుతామన్నారు. సగటు జీవితకాలం రేటు క్రమంగా పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఆనంద్, ఉపాధ్యాయులు మంజుశ్రీ, నరసింహరావు, లక్ష్మణ్, జీవిత, వైద్య సిబ్బంది ఇమామ్, తదితరులు పాల్గొన్నారు.