మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 15.. మండల పరిధిలోని బచ్చువారిగూడెం గ్రామపంచాయతీ, జెట్టివారి గూడెం గ్రామం పోడు సమస్యను పరిష్కరించండని, అసలైన లబ్ధిదారులకు భూమి దక్కేలా చూడాలని జెట్టివారిగూడెం గ్రామస్తులు స్థానిక తహసీల్దార్ విల్సన్ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. జెట్టి వారి గూడెం గ్రామానికి చెందిన జెట్టి భద్రమ్మ, జెట్టి నాంచారమ్మ, మిర్యాల సీతాదేవి, జెట్టి నాగమణి, కురసం చిన్నక్క తదితరులు తహసిల్దార్, ఎంపీడీవో లను కలసి సమస్యలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం నుండే సుమారు పది ఎకరాలు భూమిని సాగు చేసుకుంటున్నామని, ఇట్టి భూమికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు మంజూరు చేస్తున్నారని తెలిసి మా పోడుభూమికి సంబంధం లేని వారు అటవీ హక్కుల గ్రామ కమిటీతో కలిసి సుమారు 40 మంది అర్హత లేకపోయినా అప్లికేషన్లు పెట్టించి సర్వే చేయించుకున్నారని, ఇట్టి విషయమై పూర్తిస్థాయి విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని వారు అధికారులు కోరారు.