మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి 15 . మండలంలోని మొరంపల్లి బంజర్ గ్రామానికి చెందిన సీనియర్ లారీ డ్రైవర్ బిల్లా కృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మొరంపల్లి బంజరు గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్యా దివ్యశ్రీ ఉప సర్పంచ్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గం నాయకులు బట్ట విజయ గాంధీ, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సీతారాం నాయక్, భారత రాష్ట్ర సమితి జిల్లా నాయకులు మేడం లక్ష్మీనారాయణ రెడ్డి, మొరంపల్లి బంజర్ టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కాగేందర్ రెడ్డి. నేస్తం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బత్తుల రామకొండారెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు సాయి శ్రీను బిల్లా కృష్ణ బుధవారం పార్థివదేహానికి పూలమాలు నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.