UPDATES  

 ఆర్థిక లావాదేవీల పై అప్రమత్తత అవసరం – అశ్వారావుపేట ఎస్బిఐ మేనేజర్ టి కృష్ణ

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 15.. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా పెరుగుతున్న తరుణంలో ఆర్థిక లావాదేవీలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అశ్వరావుపేట ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ టి కృష్ణ అన్నారు. బుధవారం అశ్వరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు 2023 కార్యక్రమంలో భాగంగా సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్స్ వి అంజిబాబు, డి చంటి లు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజర్ టి కృష్ణ మాట్లాడుతూ ఆర్బిఐ ఆర్థిక అక్షరాస్యత 2023 వారోత్సవాల భాగంగా ప్రతి ఒక్కరు పొదుపు సూత్రం పాటించి ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో మోసాలు కూడా అదేవిధంగా పొంచి ఉంటాయన్నది మర్చి పోరాదన్నారు. బ్యాంకు లావాదేవీలలో వినియోగించే ఏటీఎం కార్డులకు వచ్చే ఓటిపిలను ఎవరికి చెప్పరాదని అదే విధంగా ఈమెయిల్ ఐడి లకు ఉండే పాస్వర్డ్ లను ఎవరికీ ఇవ్వరాదు అన్నారు. నిరక్షరాస్యతతో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అదే విధంగా కొంతమంది మోసాలకు బలైపోతున్నారని ఏది ఏమైనా బ్యాంకు లావాదేవీలలో ఆర్థికపరంగా అప్రమత్తత అవసరం అన్నారు. నిర్లక్ష్యం తగదని మోసపోయినప్పుడు తక్షణం సంబంధిత బ్యాంకులకు సమాచారం ఇవ్వడం ద్వారా రక్షించుకునే మార్గం ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో విస్తృత ప్రచారం అవసరమని విద్యార్థినీ విద్యార్థులు ఈ విషయాలు పై అవగాహన ఉండి తెలియని వాళ్ళకి తెలియ చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సాగర్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !