మన్యం న్యూస్ చండ్రుగొండ, ఫిబ్రవరి 15: పామాయిల్ సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయశాఖ ఏడిఏ అబ్జల్ బేగం అన్నారు. బుధవారం మద్దుకూరు గ్రామంలో ఉద్యానవన, మరియు పట్టుపరిశ్రమ, గోద్రేజ్ ఆగ్రోటెక్ ఆధ్వర్యంలో జరిగిన పామాయిల్ రైతుల అవగాహన సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం పామాయిల్ సాగు కోసం సబ్సీడి ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, రైతులు సాగుపై దృష్టి సారించాలని, పామాయిలు మార్కెట్ ఎప్పుడూ ఉంటుందన్నారు. పామాయిల్తో పాటు, అంతరపంటగా టమాటా, ఇతర పంటలు సాగు చేసుకోవచ్చని, టమాటా వల్ల ఎలుకల బాధ తగ్గుతుందన్నారు. రైతులందరూ పెస్టిసైడ్స్ వాకుండా గోవు ఆధారిత సాగుపై దృష్టి సారించాలని, ఆర్గానిక్ యుగంగా మారిందని, ఆర్గానిక్ పంటలను వస్తువులను వాడిన వారు ఆరోగ్యంగా ఉంటారన్నారు. డ్రిప్ ఏర్పాటు చేసుకున్న వెంటనే మొక్కలు నాటుకోవాలని, తద్వారా మొక్కల ఎదుగుదలలో ఎటువంటి తేడాలు
నాటుకోవాలని, తద్వారా మొక్కల ఎదుగుదలలో ఎటువంటి తేడాలు ఉండవన్నారు. ప్రతి రోజూ మొక్కలకు నీరు అందేలా చూడాలన్నారు. మొక్కలకు సూక్ష్మపోషకాలు మెగ్నీషియం, బోరాన్, జింక్) వంటి లోపాలు రాకుండా చూడాలన్నారు. మొగిలో గుళికలు రైతులు దగ్గరుండి కూలీల చేత వేయించాలని.
లేకుండా తగిన ఫలిత ఉండదన్నారు. ఈ సమావేశంలో ఏఓ వినయ్. అన్నపురెడ్డిపల్లి ఏఓ అనూష, హార్టికల్చర్ అధికారి కిరణ్, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు గాదె లింగయ్య, పంచాయతీ సర్పంచ్ పద్ధం వినోద్. ఏఈఓలు విజయ్, రైతులు,తదితరులు పాల్గొన్నారు.
