మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి15:- సింగరేణి కె ఎల్ పి భూపాలపల్లి మైనింగ్ లో ఇటీవల కాలంలో జరిగిన ప్రమాదానికి భాద్యున్ని చేస్తూ సాదుల ప్రకాష్ సీనియర్ మైనింగ్ సర్ధార్ ను డిస్మిస్ చేయటాన్ని నిరసిస్తూ బుధవారం రోజు ఇల్లందు జేకేఓసి వద్ద టిబిజీకేఎస్ స్టాప్ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా టిబిజీకేఎస్ ఇల్లందు ఉపాధ్యక్షుడు రంగనాథ్ మాట్లాడుతూ..ప్రమాదాలు కావాలని ఎవరూ చేయరూ, ప్రమాదం జరిగిందని ఒక ఉద్యోగిని విధులనుంచు తొలగిస్తే పనిచేసే మిగతా ఉద్యోగుల,మానసిదైర్యంసన్నగిల్లుతుందన్నారు.అలాగే తోలగించబడిన ఉద్యోగి కుటుంబం రోడ్డున పడుతుందన్నారు.మానవతా దృక్పథంతో సాదుల ప్రకాష్ ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మైనింగ్ స్టాఫ్ నాయకులు బోల్లేద్దు ప్రభాకర్ ,మేకల శంకర్రావ్, కుడితి శ్రీనివాస్, రాంచందర్, రమేష్,బుచ్చయ్య,రాజయ్య,వంశీ,నవీన్,వివేక్,ప్రవీణ్, ప్రసన్న పాల్గొన్నారు.
