మన్యం న్యూస్: జూలూరుపాడు, ఫిబ్రవరి 15, మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైరాలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళన సభకు బుధవారం సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మండలానికి చెందిన పొంగులేటి వర్గీయులు కదిలి వెళ్లారు. మండల కేంద్రంలో జై పొంగులేటి, జై జై పొంగులేటి, పొంగులేటి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ వందల మందితో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి అనుచరుడు దారావత్ రాంబాబు మాట్లాడుతూ.. పొంగులేటి ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తామని తెలిపారు. అనంతరం వైరా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో దారావత్ రాంబాబు, దుద్దుకూరి మధుసూదనరావు, ఎల్లంకి నాగేశ్వరరావు, లేళ్ళ గోపాలరెడ్డి, దాసరి నాగయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు
