UPDATES  

 కెసిహెచ్ పి లో డస్ట్ నివారణ చర్యలు చేపట్టాలి… -మణుగూరు ఏరియా టిబిజికెయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు ప్రభాకర్ రావు.

మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 15: సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా కె సి హెచ్ పిలో డస్ట్ నివారణ చర్యలు చేపట్టాలని మణుగూరు ఏరియా టిబిజికెయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు ప్రభాకర్ రావు కోరారు. ఆయన గురువారం డి వై జి యం సురేష్ కి వినతి పత్రాన్ని అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులు పని చేస్తున్న ప్రదేశాలలో దుమ్ము, ధూళి నివారణ చర్యలు తక్షణమే చేపట్టాలన్నారు. నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ గుర్తింపు కార్మిక సంఘం గా టి బి జి కె యస్ అనేక మార్లు యాజమాన్యాన్ని కోరినప్పటికీ పూర్తిస్థాయిలో అధికారుల నివారణ చర్యలు చేపట్టడంలో విఫలం చెందారన్నారు. నిర్దేశించిన బొగ్గు రవాణా లక్ష్యాలను సాధించడం పై ఉన్న శ్రద్ధ కార్మిక ఆరోగ్య శ్రేయస్సు పై లేదని ఆయన మండిపడ్డారు. విధులు నిర్వహిస్తున్న ప్రదేశాలలో విపరీతమైన దుమ్ము ,ధూళి రావడం వల్ల కార్మికులు శ్వాస కోశ వ్యాధుల బారినపడుతూ ఆసుపత్రి పాలు అవుతుండడంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. నాలుగు రోజులలో డస్ట్ నివారణకు పూర్తిస్థాయిలో గని యాజమాన్యం చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !