మన్యం న్యూస్ వాజేడు, ఫిబ్రవరి 17
ములుగు జిల్లా, వాజేడు మండలం,గుమ్మడిదొడ్డి గ్రామంలో గ్రామస్తుల సహకారంతో జిల్లాస్థాయి వాలీబాల్ మెగా టోర్నమెంట్ నిర్వహించారు. లీగ్ మ్యాచ్ లో శుక్రవారం ఇరుజట్లతో హోరాహోరీ జరిగిన ఆటలో చింతకుంట జట్టు ప్రథమ బహుమతి సాధించారు. ద్వితీయ బహుమతి పూసూరు జట్టు, తృతీయ బహుమతి రొయ్యూరు జట్టు, చతుర్ద బహుమతి గుమ్మడిదొడ్డి జట్టు గెలుపొందారు.