UPDATES  

 ముగిసిన సుర పాపయ్య జాతర… వాలీబాల్ విజేతలకు బహుమతులు అందించిన నిర్వాహకులు

మన్యం న్యూస్ గుండాల.. ఫిబ్రవరి 17 .. కుంజ వారి ఇలవేల్పు సుర పాపయ్య జాతర మూడు రోజులు ఘనంగా నిర్వహించి శుక్రవారం ముగిసింది. జాతరలో భాగంగా నిర్వాహకులు వాలీబాల్ టోర్నమెంట్ను ప్రత్యేక నిర్వహిస్తున్నారు.  ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు జాతర నిర్వాహకులు అందించారు. మొదటి బహుమతి కామారం 10116, రెండవ బహుమతి కొత్తగూడెం 7516, మూడవ బహుమతి కొడిశెల 5016, నాలుగో బహుమతి శంభుని గూడెం 3116 ప్రైజ్ మనీని గెలుచుకోగా  క్రీడాకారులకు అందించారు. ప్రతి సంవత్సరం శంభుని గూడెం గ్రామంలో కుంచవారు సూర పాపయ్య జాతరను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో వెంకట్ నారాయణ, టిఆర్ఎస్ నాయకులు మోకాళ్ళ వీరస్వామి, వట్టం రవి, కొరసా లాలయ్య, జాతర నిర్వాహకులు దొర వెంకన్న, పటేళ్లు, కుంజ వంశీయులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !