*మన్యం న్యూస్, అశ్వరావుపేట, ఫిబ్రవరి 17..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా అశ్వరావుపేట మండలంలో పలుచోట్ల శుక్రవారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఎమ్మెల్యే మెచ్చా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా స్థానిక భగత్ సింగ్ సెంటర్ యందు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, జై కేసీఆర్, కెసిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలు చేశారు అనంతరం. మండలంలో పలుచోట్ల పుచ్చకాయలు పంపిణీ చేసి రైతు కష్టం విలువ తెలిసినవాడు కేసీఆర్ అంటూ కొనియాడారు. వినాయకపురం గ్రామంలో బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో జడ్పిటిసి, వైస్ ఎంపీపీ, బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.