ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు
-కేక్ కట్ చేసి రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ
-ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో మొక్కలు నాటారు.
మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి17.. మండల కేంద్రంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా బూర్గంపాడు మండలం బి ఆర్ యస్ పార్టీ ఆధ్వర్యం లో శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణి చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం లో బూర్గంపాడు మండల జెడ్పీటీసీ శ్రీ కామిరెడ్డి శ్రీలత, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసానీ శ్రీనివాస రావు, మండల బి అర్ యస్ పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, పినపాక నియోజక వర్గం స్టీరింగ్ కమిటీ సభ్యులు మెడగం లక్ష్మీ నారాయణ రెడ్డి, పినపాక నియోజక వర్గం యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణ చంద్ర రావు, సర్పంచ్ సిరిపురాపు స్వప్న తదితరులు పాల్గొన్నారు.