మన్యం న్యూస్ చర్ల, ఫిబ్రవరి 17..
చర్ల మండలం బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 69వ జన్మదినం వేడుకలు శుక్రవారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చర్ల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు సోయం రాజారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు నినాదాలతో తెలిపారు.అనంతరం సత్యనారాయణ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు, రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోమండల ప్రధాన కార్యదర్శి నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్, అధికార ప్రతినిధి ఇరస వడ్ల రాము, ఉపాధ్యక్షులు పోలిన లంక రాజు, ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి, బిసి సెల్ అధ్యక్షుడు దొడ్డి సూరిబాబు, రైతు బంధు సమితి క్లస్టర్ తోటపల్లి మాధవరావు, కేశవపురం సర్పంచ్ కోరం నాగేంద్ర, ఉద్యమకారుడు పటాన్ మహబూబ్, సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు, తడికల లాలయ్య,అజీజ్, చిన గొర్ల రాజబాబు, కవ్వాల రాము తదితరులు పాల్గొనడం జరిగింది.
