మన్యం న్యూస్ చంద్రుగొండ ఫిబ్రవరి 16 : మండల పరిధిలోని బెండాలపాడు శివారు కనకాద్రి గుట్టలలో కాకతీయుల కాలం నాటి ప్రతాపరుద్రుడు పరిపాలించిన ప్రదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసి ఉన్న శ్రీ పల్లేరు వీరభద్ర స్వామి ఆలయం మహాశివరాత్రికి కొత్త హంగులతో ఆలయ కమిటీ సభ్యులు ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ…మహాశివరాత్రి రోజు వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు, అన్నదానం, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చండ్రుగొండ నుండి హస్తాలవీరన్న గుడి వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం, అక్కడనుండి పల్లేరు వీరభద్ర స్వామి గుడి వరకు లారీ సౌకర్యం వచ్చే భక్తులకు ఏర్పాటు చేశామన్నారు.
పల్లేరు వీరభద్ర స్వామి యొక్క ప్రత్యేకతలు.. కనకాద్రిగుట్టపై 365 రోజులపాటు కొలనులో నీరు ఉండడం, భక్తులు పుణ్య స్థానాలు చేసి పాపాలు తొలగుతాయని నమ్మకం, ఆ కొలనులో నీరుని తీసుకొని వచ్చి ఇంట్లో చల్లడం, పంట పొలాలలో చల్లడం వల్ల ఇంట్లో చీడపీడలు, పంట పొలాల్లో మంచిగా దిగుబడి వస్తుందని భక్తులకు నమ్మకం కావడం వల్ల వేలాదిమంది భక్తులు వచ్చి కొలనులో పుణ్య స్థానాలు చేసి, పల్లేరు వీరభద్ర స్వామిని దర్శించుకొని, కొలను నీరు తీసుకెళ్తూ ఉంటారు. కనకాద్రి గుట్టలపై చూడదగ్గ ప్రదేశాలు ఏనుగుల మూట, ఏనుగుల బావులు, గుట్టపై నుండి చూస్తుంటే విశాలమైన సుందర ప్రదేశలు కనబడుతూ ఉంటాయి. మహాశివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా, కన్నుల విందుగా, మేళ తాళాలతో వచ్చిన భక్తుల నృత్యాలతో ఆహ్లాదకరంగా ప్రధాన అర్చకులు విప్పర్ల వెంకటరామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం పదివేలకు పైగా భక్తులు వస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.