మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 16: ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తానని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి సుధా రాణి అన్నారు. గురువారం మండలంలో పర్యటించిన ఆమె పలువురుని పరామర్శించారు. మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ నాయకురాలు మొక్క సమ్మక్క ను ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. గుండాల తండా కు చెందిన జాటోత్ బాలు కూతురు అనారోగ్యం పాడిన పని పడిందని బాలు సూచించడంతో మెరుగైన వైద్యం కోసం తన వంతు సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్, మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, యువజన విభాగం అధ్యక్షులు అజ్జు, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్ , మైనార్టీ సెల్ అధ్యక్షులు సుభాని,ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, పార్టీ నాయకులు సుబ్బారావు, మైనార్టీ నాయకులు ఆదాం, తదితరులు పాల్గొన్నారు
