UPDATES  

 మానవత్వం చాటుకున్న ఓసి- 2 పవర్ సెక్షన్ ఉద్యోగులు ఓసి-2 సొసైటీ ఉద్యోగి రవిచంద్ర కుటుంబానికి రూ. 15,000 రూపాయలు ఆర్థిక సహాయం

 

మన్యం న్యూస్ మణుగూరు, ఫిబ్రవరి 16..
మణుగూరు సింగరేణి ఏరియా పీకే ఓసి-2 ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లో పొరుగు సేవల ఉద్యోగిగా పనిచేస్తూ ఇటీవల జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయాల పాలై,హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ,వారం రోజుల క్రితం మృతి చెందిన ముత్యాలమ్మ నగర్ కి చెందిన తెన్నేటి రవిచంద్ర కుటుంబానికి ఓసీ-2 పవర్ సెక్షన్ ఉద్యోగులు గురువారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లి భార్య గాయత్రిని ఇద్దరు కుమార్తెలను పరామర్శించారు.అనంతరం రూ.15,000/ రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా పవర్ సెక్షన్ నాయకులు చిట్టూరి.రవిబాబు మాట్లాడతూ,ఓసి-2 సొసైటీలో దీర్ఘకాలికంగా పొరుగు సేవల ఉద్యోగిగా పనిచేయటమే కాకుండా,సొసైటీ నిబంధనవళి పై సమగ్ర అవగాహన కలిగి ఉండటం,ఆదాయపు పన్ను బ్యాంకు రుణాల మంజూరు కు సంబంధించి కూడా కార్మికులకు తలలో నాలుకలా పని చేసే అందరివాడు రవి చంద్ర అని అన్నారు.ఇలా చనిపోవడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రవి గాయత్రి దంపతులకు ఇద్దరు కుమార్తెలని,వారు చదువుకుంటున్నారని ఓసి- 2 సొసైటీ సభ్యులుగా రవిచంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించడంతో పాటు వారి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని పవర్ సెక్షన్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అనంతరం రవి చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పవర్ సెక్షన్ ఉద్యోగులు వనమా రామారావు,మార్క్స్ ఆంతోటీ, సుధాకర్,చింతల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !