UPDATES  

 ప్రతివ్యక్తి ఆదర్శంగా జీవించేందుకే సంస్కృతి సాంప్రదాయాలు విభిన్న సంస్కృతులకు గ్రామాలు నిలయాలు

  • ప్రతివ్యక్తి ఆదర్శంగా జీవించేందుకే సంస్కృతి సాంప్రదాయాలు
  • విభిన్న సంస్కృతులకు గ్రామాలు నిలయాలు
  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
  • తెలగరామవరంలో ఉత్సాహంగా బొడ్రాయి ప్రతిష్ట

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 16…ప్రతివ్యక్తి ఆదర్శంగా జీవించేందుకు మన పూర్వికులు నాటి నుంచి వస్తున్న ఆచార, వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు దోహదపడతాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. లక్ష్మి దేవిపల్లి మండల పరిధిలోని తెలగరామవరం గ్రామంలో శ్రీ సీతారామ, ముత్యాలమ్మ, బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవం గురువారం కన్నుల పండువగా జరిగింది. గ్రామస్తుల, ఆలయ కమిటి ఆహ్వానంమేరకు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ విభిన్న సంస్కృతులకు,గ్రామాలునిలయాలుగానిలుస్తున్నాయని, నేర్పిన సంస్కృతి, సాంప్రదాయాలను ఆచరిస్తూనే అభినందనీయమన్నారు. భావితరాలను మన పూర్వీకులు అందించడం ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర భారతదేశంలో అన్ని కులాలు, మతాలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి సాధిస్తుందని, విద్వేశాలు లేని సమాజం నిర్మించబడుతుందని పేర్కొన్నారు. ప్రజలను సన్మార్గంలో నడిపించేందుకు ఆధ్యాత్మికతవైపు, భక్తిమార్గంవైపు పయనించాలని తద్వారా మానవ సంబందాలు మెరుగుపడతాని పెద్దలు సూచించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం గ్రామ, ఆలయ కమిటి ఆధ్వర్యంలో కూనంనేనిని శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, చంద్రగిరి గిరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !