UPDATES  

 సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు అడ్డుకున్న గ్రామస్తులు..

మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 20..
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులను మండలంలోని పెరాయిగూడెం గ్రామస్తులు సోమవారం నిలిపివేశారు. ప్రాజెక్టు కోసం రైతుల వద్ద నుంచి బలవంతంగా భూసేకరణ చేసి అతి తక్కువ నష్టపరిహారం చెల్లించి పనులు చేసుకుంటూ అదనంగా మరికొంత భూమిని ఆక్రమిస్తూ రైతులకు కనీసం సమాచారం ఇవ్వకుండా తవ్వుతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు మేరకు స్థానిక సర్పంచ్ తెల్లం వరలక్ష్మి, ఏఎస్పి డివిజన్ అధ్యక్షుడు మల్లు దొర తో కలిసి ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ రైతులు సాగు చేసుకుంటుంటే భూములను వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అటువంటి అధికారులపై మండిపడ్డారు ఇట్టి విషయమై ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు అందించిన స్పందించడం లేదని నష్టపరిహారం చెల్లించకపోతే పనులను అడ్డగించి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన మండల అధికారులు పట్టించుకోవడంలేదని ఇట్టి విషయమై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన నాయకురాలు వాగే రాజేశ్వరి, కోరం మురళి, వెంకటేష్, సకినం సతీష్, నాగమణి, పోడియం వెంకటరమణ, రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !