మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 20
మండల పరిధిలోని నరసాపురం గ్రామపంచాయతీ నందు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ వర్ష శివరామకృష్ణ, ఉపసర్పంచ్ సిపిఐ మండల కార్యదర్శి రావులపల్లి రవికుమార్ తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని గ్రామ ప్రజలు అందరూ కంటి వెలుగు కార్యక్రమం దృష్టిలోపాలు ఉన్నటువంటి వారికి పరీక్షలు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం కళ్లద్దాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నరసాపురం ప్రాథమిక వైద్య కేంద్రం డాక్టర్ నిశాంత్, అత్తమాలజిస్ట్ అసిస్టెంట్ కొండయ్య, హెల్త్ అసిస్టెంట్ బాబురావు, సూపర్వైజర్ రమణమ్మ, ఏఎన్ఎం పూర్ణ, అంగన్వాడి టీచర్, కార్యదర్శి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
