UPDATES  

 దాహం…. దాహం వేసవి రాకముందే నీటి కష్టాలు

దాహం…. దాహం
వేసవి రాకముందే నీటి కష్టాలు
మిషన్ భగీరథ నీళ్లు చాలక గ్రామస్తుల పాట్లు
ఎమ్మెల్యే రేగా సారే చొరవ చూపాలి
మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 20… ఎండాకాలం మొదలుకానే లేదు ఆ గ్రామంలో నీటి కష్టాలు మొదలయ్యాయి మిషన్ భగీరథ నీళ్లు చాలక గ్రామస్తులు నానా పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సారే చొరవ చూపాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చీమల గూడెం గ్రామంలో వేసవికాలం వచ్చిందంటే చాలు నీటి కష్టాలు ఆ గ్రామాన్ని వెంటాడుతాయి కానీ ఈసారి కొంచెం ముందుగానే నీటి ఎద్దడి మొదలవడంతో గ్రామస్తులు గుండెల్లో గుబులు మొదలైంది. మొత్తం ఆ గ్రామంలో 130 ఇండ్లు ఉండగా ఊరు మొత్తానికి ఒకే బోరు ఒకే బావి ఉంది దీనివల్ల గ్రామస్తులు మొత్తం వీటి మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీరు ఇస్తున్నప్పటికీ అవి 5 నుంచి 10 బిందెలలోపే నీళ్లు వచ్చి ఆగడంతో ఆ నీరు ఎటు చాలటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక మళ్ళీ మొదటి తంతే మొదలవుతుందన్నట్టు పాత భాయిపైనే ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది అందులో భాగంగా గ్రామస్తులందరూ బాయి పూడికతీత పనులను ప్రారంభించారు. గ్రామంలోని పురుషులు మహిళలు సైతం పూడికతీత పనులలో నిమగ్నమై పనులను పూర్తి చేశారు. ప్రతి ఏటా వేసవిలో గ్రామంలో ఉండాలంటేనే నరక యాతన గా ఉంటుందని బుక్కెడు నీళ్లు కూడా తాగేందుకు కటకటగా ఉంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈ సమస్యపై దృష్టి సారిస్తే తప్ప తమ సమస్య తీరని చీమల గూడెం గ్రామస్తులు వేడుకుంటున్నారు. మిషన్ భగీరథ నీళ్లయిన ఎక్కువసేపు వదిలే విధంగా అధికారులకు ఆదేశించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదిలోనే సమస్యను పరిష్కరిస్తేనే రానున్న వేసవిలో నీటి కష్టాలు తొలుగుతాయని వారు విజ్ఞప్తి చేస్తున్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !