UPDATES  

 ఉపాధి హామీ పథకం క్రింద మంజూరైన సిసి రోడ్ల అడ్డగోలు నిర్మాణం ..కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వార్డు మెంబర్ గుగులోత్ నీలావర్ణ.

మన్యం న్యూస్ చండ్రుగొండ ఫిబ్రవరి 20 : మండలంలోని చండ్రుగొండ గ్రామపంచాయతీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీకి వచ్చిన నిధులపై ఎమ్మెల్యే వర్గీయులు పెత్తనం చేస్తున్నారని వార్డ్ మెంబర్ గూగుల్ నీలవర్ణ సోమవారం గ్రీవెన్స్ డే లో జిల్లా కలెక్టర్ అనుదీప్ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన ఆరోపిస్తూ ఉపాధి హామీ పథకం క్రింద సీసీ రోడ్ల నిర్మాణం కొరకు మంజూరైన రూ 45 లక్షల నిధులకు గాను 10 సిసి రోడ్లకు నిర్మాణం ఎమ్మెల్యే వర్గీయులు వాళ్ల ఇష్టారాజ్యంగా ప్రజలకు అవసరం ఉన్నచోట సీసీ రోడ్లకు నిర్మాణానికి తీర్మానం చేయకుండా, అవసరం లేని చోట, వాళ్లకు నచ్చిన చోట, సీసీ రోడ్ల తీర్మానాన్ని చేయించుకుంటున్నారని ఆరోపించారు.పాలకవర్గ సమావేశంలో వార్డు మెంబర్ తను మాట్లాడితే నీకేం సంబంధం, నీ డబ్బులు ఏమైనా ఖర్చు పెడుతున్నావా, అంతా మా ఇష్టం అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, ఒక ఎస్టీ వార్డు మెంబర్ అని కూడా చూడకుండా తక్కువగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ నిధులపై సమగ్ర విచారణ జరపాలని, ప్రజలకు అవసరమైనచోట్ల సీసీ రోడ్ల నిర్మాణం చేయాలని, కలెక్టర్ కు ఫిర్యాదు లో పేర్కొన్నట్లు తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !