మన్యం న్యూస్ అన్నపురెడ్డిపల్లి ఫిబ్రవరి 19: అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీకి చెందిన గిరిజనులు ఎమ్మెల్యే మెచ్ఛా నాగేశ్వరరావును వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి 40 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న పోడు భూములకు సంబందించిన విషయాన్ని వారి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలి అని ఆదేశించారు. అనంతరం నిరుపేద గిరిజనులు అయిన వారికి హెల్త్ సెంటర్ నిర్మించటమే కాగ గతంలో నిర్మించిన సిసి రోడ్లకు అదనంగా కొత్తగా సుమారు 30లక్షల రూపాయల నిధులు సిసి రోడ్లు కేటాయించినందుకు వారికి ఎప్పటికీ రుణ పడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వేముల హరీష్,మండల యువజన విభాగం అధ్యక్షుడు వెంకటేష్,యస్.సి సెల్ నాయకులు వెంకటేశ్వరరావు,గిరిజన నాయకులు బేతి నాగులు,సున్నం రాములు,సున్నం వెంకటేష్,కూరం బాలు,పద్ధం నవీన్,ఎల్లావుల మహేష్,సత్యనారాయణ,వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.