UPDATES  

 ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ట్రాక్టర్ • పలువురికి స్వల్పగాయాలు

 

మన్యం న్యూస్ చండ్రుగొండ, ఫిబ్రవరి 19: అతిగా మద్యం సేవించిన ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా
జాతీయరహదారిపై వెళ్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టించటంతో పలువురికి
స్వల్పగాయలైనా సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, ప్రయాణికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి….. పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామానికి చెందిన ఇరుపా రమేష్, వర్సా శ్యామ్, ఇరుప శ్రీనులు బూర్గంపాడు మండలం లక్ష్మిపురం గ్రామంలో వ్యవసాయ పనులు ముగించుకొని ట్రాక్టర్ పై స్వంత గ్రామానికి వస్తుండగా దామరచర్ల గ్రామం వద్ద, ప్రక్కగా మచిలీపట్నం వెళ్తున్న ఆర్టీసి బస్సును మద్యం మత్తులో ఉన్న ఢీకొట్టిండు .దీంతో ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నుజ్జునుజ్జవ్వగా, ట్రాక్టర్ టైరు ఊడి అటుగా వెళ్తున్న ఇడే గ్రామానికి చెందిన బత్తుల గోపాల్ అనే వృద్ధుడు సైకిల్ పై వెళ్తుండగా టైరు డీకొట్టింది. దీంతో అతనికి సైతం గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. ఎస్సై విజయలక్ష్మి ప్రమాదం జరిగిన చోటుకు వచ్చి దర్యాప్తును చేపట్టారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !