UPDATES  

 నిబంధనలకు విరుద్ధంగా ల్యాండ్ బదలాయింపు చేసిన ఆర్డీవోపై విచారణ జరిపించాలి యెర్రా కామేష్ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 19 . ఏజెన్సీ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా భూ బదలాయింపు చేసిన కొత్తగూడెం ఆర్డీవో పై విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చుంచుపల్లి మండలంలో సర్వే నెంబర్ 158/1ఆ నుంచి 159/6అ/2 వరకు 6 ఎకరాల 20 కుంటల భూమితో పాటు ఇంకో ఆరున్నర ఎకరాల భూమిని గిరిజనేతరులకు భూ బదలాయింపు చేయగా వారు ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా,పంచాయతీ రాజ్ చట్టాలకు వ్యతిరేకంగా వెంచర్లు వేసి ప్లాట్లు చేసి గిరిజనేతరులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి,పాల్వంచ మండలాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా భూ బదలాయింపు చేశారని ఆర్డీవో గా స్వర్ణలత గారు డ్యూటీలో చేరిన నాటి నుంచి చేసిన భూ బదలాయింపులపై కమిటీ వేసి విచారణ జరిపించాలని…అధికారులు స్పందించకుంటే లోకాయుక్తలో పిర్యాదు చేస్తామని తెలిపారు.
ఈసమావేశంలో సాయి,చెనిగారపు నిరంజన్ కుమార్,నాగుల రవికుమార్,వంగా రవిశంకర్,ఆకుతోట పవన్ కళ్యాణ్* తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !