మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 21 …జి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 26న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ కేటీపీఎస్ క్యాంపస్ లో కేటీపీఎస్ డి ఏవి స్కూల్ ఆవరణంలో ఉద్యోగులు, కార్మికులు, జర్నలిస్టుల కోసం ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు జి ఎస్ ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాస్ పేర్కొన్నారు
హైదరాబాద్ యశోద ఆస్పత్రి సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యపరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. కేటీపీఎస్ ఉద్యోగులు/కార్మికులు, జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డా. గడల శ్రీనివాసరావు కోరారు. వైద్య శిబిరంలో ఉచిత కన్సల్టేషన్, మందులు ఇవ్వడంతో పాటు వైద్య నిర్ధరణ పరీక్షలు చేసి అవసరమైన వారికి ఫ్రీగా సర్జరీలు కూడా చేస్తారన్నారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్లు- 90000 37676, 90000 86767, 90000 74646, 95040 06999. సంప్రదించాలని కోరారు
