UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 కళ్యాణ లక్ష్మి పేదలకు భరోసా…. – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి21: రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న కల్యాణ లక్ష్మి నిరుపేద కుటుంబాలకు భరోసాను కల్పిస్తుందని పినపాక ఎమ్మెల్యే కాంతారావు అన్నారు. మంగళవారం ఆయన అశ్వాపురం మండలం లో 50 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం పేదలకు ఎంత గానో అండగా నిలుస్తుందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో రాష్ట్రంలోని ఎంతోమంది పేద కుటుంబాల ఆడపిల్లలకు పెళ్లి చేసే భారం తగ్గిందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !