UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి..m పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 వేణుగోపాల స్వామి దేవాలయం లో ధ్వజ స్వంభం పునః ప్రతిష్ట..

మన్యం న్యూస్, మంగపేట. మార్చి 18

మంగపేట మండలం రాజుపేట గ్రామం వేణుగోపాల స్వామి ఆలయం లో ధ్వజ స్థంభం పునః ప్రతిష్ట కార్యక్రమం లో భాగంగా గురువారం నుంచి ఆగమశాస్త్రం, ప్రకారం వేద మంత్రాల నడుమ శనివారం ధ్వజ స్థంభం పునః ప్రతిష్ట చేయడం జరిగింది.వేద పండితుల ప్రకారం దేవాలయం ధ్వజ స్థంభం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. ఆలయమనే దేహానికి గర్భాలయం ముఖం గాను, ఆలయ ప్రాకారం చేతులు గాను, ధ్వజ స్థంభం హృదయం గాను పోలుస్తారు. నిత్యం హరతులు జరిగే దేవాలయం లో షోడోపశార పూజ విధానం జరగాలంటే ద్వజస్థంభం తప్పనిసరి. దీపారాధన, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజ స్థంబానికి కూడా చేయాలి. దేవాలయం లో నిర్మలమైన వాతావరణం, భగవత్ ధ్యానం వంటివి మానసిక ప్రశాంతత ను కలిగిస్తాయి. ఆలయం లో మూల విరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజ స్థంభం కూడా ఆంతే ముఖ్యం ధ్వజ స్థంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది అందుకే ఆగామశాస్త్రం ప్రకారం వేదాలను అనుసరించి వేద పండితుల వేద మంత్రాల నడుమ, దూప, దీప నైవేద్యాలతో, మేళా తాళాలతో, నియమ నిష్టలతో మూడు రోజులు హోమము జరిపించి భక్తి శ్రద్దలతో ధ్వజ స్థంబానికి ప్రాణ ప్రతిష్ట చేశారు, అనంతరం శ్రీ వేణు గోపాలస్వామి కల్యాణం కన్నుల పండుగ గా జరిపించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు తీర్ధ ప్రసాదాలు స్వీకరించి వేణుగోపాల స్వామి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న భక్తులకు అన్నదానం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !