మన్యం న్యూస్ కరకగూడెం, మార్చి 21 మండల పరిదిలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు తన స్వగృహమైన కుర్నవల్లి గ్రామంలో మణుగూరు మున్సిపల్ అధికారులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు మున్సిపాలిటీ రూపురేఖలు మారనున్నాయని ప్రతి వార్డులోని అంతర్గత రోడ్లు డ్రైనేజీలు, వంటి నిర్మాణాలతో అభివృద్ధి పరచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది అన్నారు. మణుగూరు మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ,ఏఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.