UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం…

మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 21, కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర మంగళవారం జూలూరుపాడు మండల కేంద్రంలోకి ప్రవేశించడంతో మండల సిపిఎం పార్టీ శ్రేణులు జన చైతన్య యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై అధిక ధరల భారం మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తుందని, అలాంటి మతోన్మాద పార్టీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వొద్దని, రాష్ట్రంలో జన చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్నందునే ఆ పార్టీకి మద్దతు తెలుపుతున్నామన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఎవరున్నా వారికి మా మద్దతు ఉంటుందని తెలిపారు. బిఆర్ఎస్ తో పొత్తు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆ విషయంపై చర్చిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోతినేని సుదర్శన్ రావు, వెంకటేశ్వరరావు, భూక్య వీరభద్రం, కాసాని ఐలయ్య, చందర్ రావు, చీమలపాటి భిక్షం, యాస నరేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !