వరుసగా ఫ్లాప్స్ వస్తున్న సమయంలో పూరి జగన్నాథ్ పనైపోయిందని అంతా భావిస్తుండగా ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి వారందరికి తన సమాధానం ఇదే అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
రామ్ కి కూడా కెరియర్ కి బూస్ట్ ఇచ్చే విధంగా ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ఆ సినిమా తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఆ సినిమా పూరి జగన్నాథ్ ని మళ్లీ తొక్కేసింది. లైగర్ సినిమా వచ్చి ఇన్నాళ్ళైనా కూడా పూరి తన తదుపరి సినిమాని మొదలు పెట్టలేకపోతున్నాడు అంటే ఏ స్థాయిలో ఆ సినిమా నిరాశ పర్చిందో అర్థం చేసుకోవచ్చు.
రామ్ తో మరో సినిమాను పూరి జగన్నాథ్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఇటీవలే ప్రచారం జరుగుతుంది. ఆ విషయమై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. లైగర్ ఎఫెక్ట్ పూరి జగన్నాథ్ పై ఎంత కాలం ఉంటుందో తెలియదు.
మళ్లీ ఆయన మునుపటి క్రేజ్ ని మునుపటి సక్సెస్ ట్రాక్ ని సొంతం చేసుకుంటాడా లేదా అనే విషయం కూడా క్లారిటీ లేదు. రామ్ తో మరో సినిమా రూపొందించి సక్సెస్ అయినా కూడా ఆ తర్వాత సినిమాపై ప్రేక్షకులు మరియు సినిమా వారు నమ్మకం పెట్టే అవకాశం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.