UPDATES  

 వివోఏల నిరువధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన తాటి, వగ్గెల పూజ -వివోఏలను వెట్టిచాకిరి చేస్తున్న ప్రభుత్వం అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యేతాటి వెంకటేశ్వర్లు.

మన్యం న్యూస్. ములకపల్లి.ఏప్రిల్27. తెలంగాణ రాష్ట్రంలో కష్టపడుతున్న కార్మికులు కర్షకులు పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు అన్నారు.మండల కేంద్రంలో గత 11 రోజులనుండి సమ్మె చేపట్టిన విఓఏలకు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, వగ్గేల పూజ సంఘీభావం తెలిపారు, ఈ సందర్బంగా మండు టెండల్లో సమ్మె చేస్తున్న వివో ఏ లకు కూల్డ్రింగ్స్ ఇచ్చి వారికి సంపూర్ణ మాద్దతు తెలిపారు.ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో మహిళలను ఆర్థికంగా నిలబెట్టేందుకు విఓఏలు కృషి చేస్తున్నారని,వారిని తెలంగాణ ప్రభుత్వం వెట్టిచాకిరి చేస్తుందని అన్నారు, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం మొండి వైఖరితో ఉంది అన్నారు, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో సోయం చిన్నారి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జహీర్, కోండ్రు భాస్కర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పాలకుర్తి రవి, సిపిఎం నాయకులు నిమ్మల మధు, చంద్రం, వెంకీ,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !