మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండల కేంద్రంలో గత పదకొండు రోజులుగా ఐకెపి విఓఏల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఐకెపి కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న విషయం తెలుసుకొన్న పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు వివో ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేరం వెంకటేశ్వరరావు,ఉడుముల లక్ష్మారెడ్డి,తాళ్ల గుట్టయ్య,నవ్వాతి శ్రీను,వార శంకర్, మద్దెల సమ్మయ్య,తోలెం అర్జున్,బూర రవి,తోకల శ్రీను,అరె సీతయ్య,బడె కిషోర్,తోలెం అనిల్,ఎట్టి దశరధం,తాటి బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.