మన్యం న్యూస్ మణుగూరు టౌన్:ఏప్రిల్ 27
మణుగూరు మండలం లోని కూనవరం గ్రామపంచాయతీ లో మడకం వారి వీధి లో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని అక్కడి ప్రజలు చెప్పగానే వెంటనే స్పందించిన స్థానిక సర్పంచ్ ఏనిక.ప్రసాద్,ఎంపిటిసి గుడిపూడి.కోటేశ్వరరావు దగ్గర ఉండి క్రొత్త పైపు లైన్ వేసి వీధి లో ఉన్న మంచినీటి సమస్య ను వెంటనే పరిష్కరించారు. సమస్యపై సత్వరమే స్పందించిన సర్పంచ్ ఏనిక. ప్రసాద్ కు,ఎం పి టి సి లు గుడిపూడి.కోటేశ్వరరావు, తాటి.సరిత కు,పంచాయతీ కార్యదర్శి సంధ్యా రాణి కి ఆ వీధి ప్రజలు అందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టీ కూనవరం పంచాయతీ అధ్యక్షులు పిన్నక.వెంకట్రావు, నాయకులు వంక.అర్జున్ రావు. వెంకన్న,మేకల.రాములు తదితరులు పాల్గొన్నారు.