UPDATES  

 ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటనను ఖండిస్తున్న జెడ్పిటిసి సున్నం నాగమణి.

మన్యం న్యూస్. ములకలపల్లి. ఏప్రిల్ 27.మండలం లోని మాదారం గ్రామం లొ జడ్పిటిసి సున్నం నాగమణి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ,తాము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను అల్లా కల్లోలం చేయడానికి అమిత్ షా రాష్ట్రంలో అడుగుపెట్టారని ఆగ్రహం వ్యక్తంచేసారు.శాంతి భద్రతలను కాపాడవలసిన కేంద్ర హోం మంత్రి అల్లర్లకు ఆజ్యం పోసేలా చేవళ్ల సభలో మాట్లాడారని,అత్యంత వెనుకబడిన ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ కల్పించిందని అన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, తక్షణమే అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు రద్దును వెనక్కు తీసుకోవాలని సున్నం నాగమణి డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎం.డి. అంజుమ్. మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !