మన్యం న్యూస్, దుమ్ముగూడెం ఏప్రిల్ 28:
క్రీడల్లో యువతలోని నైపుణ్యాలు వెలికి తీసి ప్రోత్సహించేందుకు వారికి జెర్సీ అందజేస్తున్నట్టు పర్ణశాల గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ వాగే ఖాదర్ బాబు తెలిపారు. శనివారం మండలంలోని ముసలిమడుగు గ్రామానికి చెందిన ఎంఎంజి యూత్ ఆయన చేతుల మీదుగా జెర్సీలను పంపిణీ చేశారు రెండు టీములుగాను ఏ టీం కు కీర్తిశేషులు కనితి ఆదయ జ్ఞాపకార్థం వారి కుమారులు నాగేశ్వరావు రమేష్ జెర్సీలు అందజేయగా బీ టిముకు ఉపసర్పంచ్ వాగే ఖాదర్ బాబు జెర్సీలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముసలిమడుగు యూత్ సభ్యులు మాట్లాడుతూ క్రీడలతో పాటు యువతను అన్ని విధాల ప్రోత్సహిస్తూ జెర్సీలు అందజేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం యువజన నాయకులు తెల్లం హరికృష్ణ శివ గజేందర్ సమ్మయ్య భరత్ హరీష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.