మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:ఇల్లందు పట్టణ నాయకులు బోళ్ళ సూర్యం మాతృమూర్తి కొమరమ్మ దశదిన కార్యక్రమానికి భద్రాద్రిజిల్లా జెడ్పీ ఛైర్మెన్ కోరం కనకయ్య శుక్రవారం హాజరయ్యారు. అనంతరం కొమరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. అధైర్య పడొద్దని అండగా ఉంటానని కోరం హామీ ఇచ్చారు. వారివెంట సర్పంచులు పాయం స్వాతి, కల్తీ పద్మ, ఉప సర్పంచ్ తాటి రాంబాబు, ఎంపీటీసీ పూనెం సురేందర్, నాయకులు చిల్లా శ్రీనివాసరావు, అజ్జూ, తాటి బిక్షం, సువార్ణపాక సత్యనారాయణ, బానోత్ శారదా, రావూరి సతీష్, పాయం ఆంజనేయులు, బియ్యాని సుధాకర్, శంకర్, శేఖర్, ఆఫ్రీన్ తదితరులు పాల్గొన్నారు.