UPDATES  

 మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన ములుగు జిల్లా అధ్యక్షులు

మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు మాటురి బాలు తండ్రి ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించి వారి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. చేరుపల్లి (కొత్తపేట) గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు రమేష్ తండ్రి ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భానోతు రవిచందర్.ఈ సందర్బంగా రవి చందర్ మాట్లాడుతూ వారి కుటుంబానికి అన్ని విధాలా కాంగ్రెస్ పార్టీ పక్షాన అండగా ఉంటామని, ఏ సమస్య వచ్చిన ఆదుకుంటామని తెలిపారు.ఈ సందర్బంగా
మూడు మండలాల పరిధిలోని యూత్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం లో మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఇప్పుడు పార్టీ నీ గెలిపింఛాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్, కార్యకర్తలు,నాయకులు బాధ్యత గా తీసుకోవాలని ముందుండి పార్టీ శ్రేయస్సు కోసం పని చేయాలని బేధాభిప్రాయాలు పక్కకు పెట్టీ అందరూ ఐక్యంగా పని చేసి అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు అన్ని విధాలుగా చేయూతనియ్యాలని కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !