UPDATES  

 అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. ఎమ్మెల్యే వీరయ్య

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 28::
ఇటీవల మండలంలో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకొని తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే వీరయ్య తాసిల్దార్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పంట నష్టపోయిన కే లక్ష్మీపురం సున్నం బట్టి కేశపట్నం లక్ష్మీనగరం గ్రామంలో వరి మిర్చి సాగు చేస్తూ నష్టపోయిన రైతులను స్వయంగా వారి పంట పొలాల్లోకి వెళ్లి పరిశీలించి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు సృష్టించిన బీభత్వానికి రైతంగం తీవ్ర నష్టం జరిగిందని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ దుమ్ముగూడెం మండల అధ్యక్షులు లంక శ్రీనివాసరావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బైరెడ్డి సీతారామారావు పిలక వెంకటరమణ రెడ్డి దర్శి సాంబశివరావు కనుబుద్ది దేవ సంగీతరావు ఉబ్బ వేణు యూత్ అధ్యక్షుడు కోడి చంటి సమ్మయ్య సంపత్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !