UPDATES  

 జల్,జంగిల్,జమీస్ పేరుతో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల స్వార్థం ఎస్పీ డా.వినీత్.

  • స్వార్థపూరిత ప్రయోజనాల కోసం అమాయకులను వాడుకుంటున్నారు
  • జల్,జంగిల్,జమీస్ పేరుతో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల స్వార్థం
    ఎస్పీ డా.వినీత్.

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకులు తమ కుటుంబాల
కోసం,స్వార్ధ ప్రయోజనాల కోసం, విలాసవంతమైన జీవితాలను గడపడం కోసం అమాయకులైన క్రింది
స్థాయి నాయకులను,దళ సభ్యులను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాడుకుంటున్నారని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఎస్సీ డా.వినీత్. గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సరిహద్దు ఏజెన్సీ గ్రామాల్లో నివసిస్తున్నఅమాయకపు ఆదివాసి యువతీయువకులను బలవంతంగా పార్టీలోకి చేర్చుకొని వారి చేతికితుపాకులు,పేలుడు సామాగ్రి ఇచ్చి పోలీసులపై దాడి చేయడానికి పంపుతూ వారికి జీవితాలేలేకుండాచేస్తున్నారన్నారు..కాంట్రాక్టర్లు,రైతులు, నాయకులను బెదిరిస్తూ అమాయకులైన క్రింది స్థాయి కేడర్ తోడబ్బులు వసూలు చేయిస్తున్నారని అన్నారుసరిహద్దు ఏజెన్సీ గ్రామాల్లోని యువతను చదువుకోనీయకుండా, వ్యవసాయం
చేయనీకుండా బలవంతంగా వారి చేతికి తుపాకులను ఇచ్చి వారి జీవితాలను నాశనం
చేస్తున్నారు.మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పన్నిన కుట్రను
గ్రహించని కింది స్థాయి అమాయక దళనాయకులు, సభ్యులు ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి
పనులను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అమాయకులైన రైతులను చంపడం, ఆదీవాసీలు సంచరించే ప్రదేశాల్లో బాంబులు పెట్టి
మూగజీవాలను బలితీసుకోవడం, కాంట్రాక్టర్లను బెదిరించడం, ఇన్ఫార్మర్ల నెపంతో తమ ఆదీవాసీలనే
చంపడం,కర్తవ్యంలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై దాడులు చేయడం లాంటి చట్ట వ్యతిరేక
పనులకు పాల్పడుతున్నారని అన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల దంతేవాడలో డి ఆర్ జి పోలీసులపై దాడికిపాల్పడి అమాయకులైన 13 మంది ఆదివాసీల ప్రాణాలను బలిగొన్నారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధిచెందితే తమకు మనుగడ ఉండదని అమాయకులైన ఆదివాసీలకు మాయ మాటలు చెప్పి మావోయిస్ట్ పార్టీ
నాయకులు తమ పబ్బం గడుపుకుంటున్నారు.
మైనర్లుగా అమాయకత్వంతో ఉన్నప్పుడు సోడి జోగయ్య,రాజేష్, సోడిమాడ,మడకం ఎర్ర,పోడియం భీమే లాంటి వారిని పార్టీలోకి చేర్చుకుని వారి చేతికి తుపాకులు ఇచ్చిమావోయిస్టులుగా తయారుచేసి పోలీసులపై దాడి చేయడానికి ఉసిగొలిపి వారు మరణించడానికిమావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులే కారణమయ్యారన్నారు. ఎదురు కాల్పుల్లో ప్రాణాలను కోల్పోయిన వారిమరణాలకు మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులే బాధ్యత వహించాలన్నారు.
దామోదర్,ఆజాద్,అరుణ ఇతర అగ్రనాయకులు అక్రమంగా సంపాదించినరక్తపు మరకలంటిన డబ్బును వివిధ ప్రాంతాల్లో ఉన్న వారి కుటుంబాలకు పంపుతూ ఆదివాసీలకుటుంబాలను మాత్రం అన్యాయం చేస్తున్నారని అన్నారు. సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైనర్ బాలబాలికలను బలవంతంగా పార్టీలోకి చేర్చుకొని వారిని వ్యక్తిగత పనులకువాడుకుంటున్నారని తెలిపారు.నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల కుట్ర తెలియక మరణించిన కింది స్థాయికేడర్ కుటుంబాలకు అగ్రనాయకులే సమాధానం చెప్పాలన్నారు.
ఇప్పటికైనా నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల కుట్రను గమనించి క్రింది స్థాయి
దళ సభ్యులుతొంగిపోయి వారి వారి కుటుంబాలను పోషించుకోవాలని సూచించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !